నేడు రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ లో ఉన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల ఆయనను కలవనున్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, పలు విభాగాల చైర్మన్ లు మధు యాష్కీ, మహేశ్వర్ రెడ్డి, దామోదర్ రాజా నర్సింహ, సీనియర్ నాయకులు జానారెడ్డి, పొన్నాల లక్షయ్య, సీతక్క, బలరాం నాయక్, తదితరులు భేటీ కానున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన 40 లక్షల డిజిటల్ మెంబెర్షిప్ అంశం, మెంబెర్షిప్ చెక్ ఇవ్వడం, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చర్చించే అవకాశాలు ఉన్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/