నేను అధికారం కోసం కాదు.. మార్పు కోసం ఓట్లు అడుగుతా – పవన్ కళ్యాణ్

విశాఖ ఎంవీపీ కాలనీలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో ఏర్పటు చేసిన జనసేన పార్టీ భారీ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. యువత భవిష్యత్ కోసం పోరాడుతుంటే అవమానాలు, వెటకారాలు చేస్తున్నారు.. అయినా వాటిని భరించడానికి సిద్ధం అన్నారు. ఉత్తరాంధ్ర చైతన్యం కలిగిన నేల, అటువంటి చోట నుంచి వలసలు ఆగాలి అని ఆకాక్షించారు. 151 సీట్లతో వైసీపీని గెలిపించినా ఇప్పటి వరకూ ఒక్కటీ సరైనా ఉద్యోగం ఇవ్వలేదని, నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, సినిమాలు చేసి వందల కోట్లు సంపాదించుకుంటే స్వార్థపరుడిని అవుతాను.. అదే, రాజకీయాల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తే 25 ఏళ్ల సేవ చేసినట్టే అన్నారు పవన్‌.. ఓటమి మీద ఓటమి ఎదురైన ఎక్కడా ఆగలేదు.. బీజేపీలో చేరితే నాకు కోరుకున్న పదవి ఇస్తారు.. అత్తరాంటికి దారేది అంటే మూడు గంటల్లో కథ చెప్పవొచ్చే.. అదే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏదీ అంటే జవాబు లేదని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో దోపిడీ జరుగుతుంటే నన్ను విమర్శించే నాయకులు ఎందుకు గుర్తించలేకపోయారు.. అని ప్రశ్నించారు. జేజేలు కొట్టి ఎనర్జీ వెస్ట్ చేసుకోకండి ఎన్నికల్లో బలంగా ఓటేయండి అని పిలుపునిచ్చారు.

“ఏపీలో టీడీపీ-జనసేన ప్రభుత్వానిదే అధికారం. 2024 ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోతారు. మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆరే ఓడిపోయారు.” అని నాగబాబు అన్నారు.