కరోనా బారినపడిన రాజ్‌నాథ్‌సింగ్‌, క‌ర్ణాట‌క సీఎం

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. వందలు , వేలు దాటి లక్షల్లోకి చేరాయి. దీంతో అన్ని రాష్ట్రాలు కరోనా కఠినతరం చేస్తున్నాయి. ఇక కరోనా బారిన సామాన్య ప్రజలే కాదు రాజకీయ నేతలు సైతం పెద్ద సంఖ్య లో పడుతున్నారు. రీసెంట్ గా ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, బిహార్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ లు కరోనా బారినపడగా..తాజాగా ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి బ‌స్వ‌రాజ్ బొమ్మై కూడా క‌రోనా బారిన పడ్డారు.

బ‌స్వ‌రాజ్ బొమ్మై తన ట్విట్టర్ లో ..త‌న‌కు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని .. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్ లోనే ఉన్నాన‌ని తెలిపిన ఆయన ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంద‌రూ కూడా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసుకోవాల‌ని కోరారు. అలాగే వారు ఐసోలేష‌న్ లో ఉండాల‌ని విజ్ఞాప్తి చేశారు.

మరోపక్క రాజ్‌నాథ్‌ సింగ్‌ సైతం తనకు కరోనా నిర్ధారణ అయినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. ప్రస్తుతం హోం క్వారెంటైన్‌లో ఉన్నట్లు, ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ట్వీట్ చేశారు.