యువగళం ముగింపు సభకు పవన్ కళ్యాణ్ రావడం లేదు

నారా లోకేష్ యువగళం ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకాలేకపోతున్నాడు. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది. ఈఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర ఈనెల 20తో ముగియనుంది. ఈ నేపథ్యంలో యువగళం ముగింపు సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 20న విజయనగరం జిల్లాలో యువగళం ముగింపు సభ జరుగనుంది.

ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి టీడీపీ అభిమానులు , కార్య కర్తలు పెద్ద ఎత్తున హాజరు కాబోతుండడంతో పార్టీ శ్రేణులు ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ సభకు చంద్రబాబు , నారా లోకేష్ , బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ రానున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హాజరుకాలేకపోతున్నట్లు ప్రకటించారు. ఇతర కార్యక్రమాలు ఉండడం వల్ల ముగింపు సభకు రాలేకపోతున్నట్లు టీడీపీ నేతలకు పవన్ కళ్యాణ్ తెలిపారు. రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరవుతానని చెప్పినట్లు తెలుస్తుంది.