కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

నిత్యం రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఇంట్లో నుండి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చేవరకు టెన్షనే. అతివేగం, మద్యం మత్తు, నిద్ర మత్తు లో డ్రైవింగ్ చేయడం , నిర్లక్ష్యంగా వాహనం నడపడం..ఇలా అనేక వాటివల్ల ప్రతి నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అమాయకపు జనాల ప్రాణాలు గాల్లొకలుస్తున్నాయి. తాజాగా కరీంనగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

కరీంనగర్ వైపు నుంచి వెళ్తున్న కారును శంకరపట్నం మండలం తాడికల్ వద్ద ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లికి చెందిన ఆకాశ్ (22), ఏంపేడుకు చెందిన శ్రావణ్ (32)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతడిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు తీసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.