పోలవరంపై కేంద్ర ప్రభత్వం కీలక నిర్ణయం
పోలవరంపై కేంద్ర ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణంలో తలెత్తిన లోపాల దిద్దుబాటుపై చర్యలు చేపట్టింది. ఈరోజు నుండి లోపల దిద్దుబాటు ఫై అధ్యయనం చేయాలని కేంద్ర జల్ శక్తిశాఖ నిర్ణయించింది.
ఈ బాధ్యతలను ఆ శాఖ సలహాదారు శ్రీరామ్ కు అప్పగించింది. ఇప్పటివరకు తలెత్తిన లోపాలు పునరావృతం కాకుండా చేయాలంటే ఏం చేయాలి? ఎలాంటి నిర్వహణ ప్రమాణాలు అనుసరించాలన్న దానిపై అధ్యయనం చేయనుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, CWC, జల్ శక్తిశాఖ అధికారులతో సమావేశమై త్వరలోనే ఒక నిర్ణయానికి రానున్నారు.