జగన్ పాలనలో వృక్షాలు సైతం కన్నీరు పెట్టుకుంటున్నాయి – పవన్ కళ్యాణ్

వైస్సార్సీపీ పాలనలో ప్రజలే కాదు వృక్షాలు సైతం కన్నీరు పెట్టుకుంటున్నాయని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో సీఎం జగన్ ఎక్కడికి వెళ్లిన ముందుగా అక్కడ ఉన్న చెట్లను నరికి వేస్తున్నారని, రోడ్ల ఫై ఒక్క చెట్టును కూడా ఉంచడం లేదని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున నెటిజన్లు , ప్రతిపక్ష పార్టీ నేతలు వాపోతున్నారు. తాజాగా జగన్ పర్యటన నేపథ్యంలో కోనసీమ జిల్లా అమలాపురంలో చెట్లు నరికిన ఫొటోలను సోమవారం పవన్ కళ్యాణ్ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. విచక్షణారహితంగా చెట్లు నరకవద్దని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి చెప్పాలన్నారు.

కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారని.. అలాంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారని పవన్‌ కళ్యాణ్ ఆక్షేపించారు. తమిళనాడులో చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలని ఆయన హితవుపలికారు.

‘ఓయీ మానవుడా
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి
అందమును హత్య చేసెడి హంతకుండా
మైలపడిపోయెనోయి నీ.. మనుజ జన్మ ..

అని దూషించు పూలకన్నియల కోయలేక
వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని
నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు..
ప్రభూ …’’ అనే పద్యాన్ని పవన్‌ కళ్యాణ్ పోస్ట్‌ చేశారు.