పవన్ కళ్యాణ్ ఫై విజయవాడ సివిల్ కోర్టులో పిటిషన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై విజయవాడ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. పవన్ ఫై ఓ మహిళా వాలంటీర్ క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. పవన్ వ్యాఖ్యలతో తమను మానసికంగా వేధించారంటూ విజయవాడ వాలంటీర్లు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ సందర్భంగా ఓ మహిళా వాలంటీర్ మాట్లాడుతూ.. తన లాయర్ ద్వారా పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. వాలంటీర్లుగా మహిళల డేటాను సేకరిస్తున్నారని, డేటాను దొంగిలించారని పవన్ అవాస్తవాలు ఆరోపించారని.., ఇది తన మనోభావాలను దెబ్బతీసిందని ఆమె ఆరోపించారు.

మహిళల అక్రమ రవాణాపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె అన్నారు. సేవ చేస్తూ వలంటీర్లపై ఆరోపణలు చేసిన పవన్‌ను చట్ట ప్రకారం శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం తాను ఒకే ఒక్క పిటిషన్ వేశానని, మరికొందరు తనను చూసిన తర్వాత వస్తారని తెలిపింది. సెక్షన్ 499, 00, 504, 505 కింద పవన్ పై కేసు పెట్టారు… బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత పవన్‌కు కోర్టు నోటీసులు జారీ చేస్తుందని, ఆ తర్వాత కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందన్నారు.