బాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్ కన్నుమూత

బాలీవుడ్ చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు ప్రదీప్ సర్కార్ (68) కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో పొటాసియం స్థాయులు క్రమంగా పడిపోవడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. డాక్టర్స్ చికిత్స అందిస్తుండగానే ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రదీప్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రదీప్ సర్కార్ మృతి ఫై నటి నీతూ చంద్ర ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రియమైన దర్శకుడు ప్రదీప్ సర్కార్ దాదా మృతి తనను బాధించిందని పేర్కొన్నారు. తన సినీ కెరియర్ ఆయన సినిమాతోనే ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. ప్రదీప్ మృతి విషయాన్ని ఆయన సోదరి మాధురి కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రదీప్ దాదా మృతిని జీర్ణించుకోలేకపోతున్నాననంటూ బాలీవుడ్ అగ్రనటుడు అజయ్ దేవగణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రదీప్ మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పరిణీత, లగా చునారీ మే దాగ్, మర్దానీ, హెలికాప్టర్ ఈలా వంటి సూపర్ హిట్ చిత్రాలకు ప్రదీప్ దర్శకత్వం వహించారు.