సెన్సార్ పూర్తి చేసుకున్న పుష్ప ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసింది.

సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు చిత్రానికి యూ/ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ చించేసాడని , సుకుమార్ డైరెక్షన్ చాల బాగుందని , దేవి శ్రీ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసిందని..ఢీ గ్లామర్ రోల్ లో రష్మిక అద్భుతంగా నటించిందని , అనసూయ మరోసారి తన టాలెంట్ చూపించిందని..ఇక మిగతా నటి నటులు కూడా చాల బాగా చేసారని చెప్పినట్లు తెలుస్తుంది.

ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 12 వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరపనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.