ఆ నాల్గు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించిన బీజేపీ
బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశాకు నూతన అధ్యక్షులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. రాజస్థాన్కు లోక్సభ ఎంపీ సీపీ జోషి, బీహార్కు ఓబీసీ లీడర్, ఎమ్మెల్సీ సామ్రాట్ చౌధరి, ఒడిశాకు రాష్ట్ర మాజీ మంత్రి మన్మోహన్ సామాల్, ఢిల్లీకి ఆ రాష్ట్ర బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్దేవాను అధ్యక్షులుగా అధిష్టానం నియమించింది.
కాగా, ఈ ఏడాది ఆఖరిలో రాజస్థాన్ లో , వచ్చే ఏడాదిలో ఒడిశాలో ఎన్నికలు జరుగున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ నూతన అధ్యక్షులను నియమించారు. అలాగే బీహార్, ఢిల్లీ రాష్ట్రాలకు కూడా బీజేపీ అధ్యక్షులను నియమించారు. అయితే, ఒకేసారి నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ నూతన అధ్యక్షులను ప్రకటించడం పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.