నోరు జారిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి..వైరల్‌గా మారిన వ్యాఖ్యలు

palakurthi-mla-yashaswini-reddy-tongue-slip

హైదరాబాద్‌ః పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నోరు జారారు.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి మధ్య పొత్తు ఉందంటూ టంగ్ స్లిప్ అయ్యారు. పాలకుర్తి నియోజకవర్గంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రానున్న రోజుల్లో బిఆర్ఎస్ కనిపించదన్నారు. చేరికల వల్ల మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న వారికి ఎలాంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో ఆమె మాట్లాడుతూ… ‘ఇక బిజెపి వాళ్లు అంటారా… వాళ్లతోనే ఇప్పుడు పొత్తు…’ అని వ్యాఖ్యానించారు. పక్కన ఉన్న ఓ నాయకుడు సరిదిద్దే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆమె మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి. లోక్ సభ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో 50 వేల మెజార్టీ ఇస్తామన్నారు. ఆ తర్వాత మళ్ళీ గుర్తు చేయడంతో… బిఆర్ఎస్‌కు, బిజెపికి పొత్తు అని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల కోసం బిఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే.