జగన్ సర్..వాళ్ళు ఏ పాపం చేసారు..అంటూ నటుడు బ్రహ్మాజీ ట్వీట్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి..చిత్రసీమపై విరుచుకపడుతున్నారు. దీంతో కొంతకాలంగా జగన్ తీరు ఫై సినీపరిశ్రమ ప్రముఖులు సీరియస్ గా ఉన్నారు. ముఖ్యంగా సినిమా టిక్కెట్ల ధరల విషయంలో జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడంతో తీవ్ర నిరాశ నిస్పృహలు వ్యక్తమవుతన్నాయి. ఇలా అయితే థియేటర్లు మూసేయాల్సిందేనని కళ్యాణ మంటపాలుగా ఫంక్షన్ హాళ్లుగా మార్చుకుని ఇతర ఆదాయ మార్గాల్ని వెతుక్కోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే పలు థియేటర్స్ ను సైతం మూసివేయడం జరిగింది. టికెట్స్ ధరలు పెంచనివ్వడం లేదు , అదనపు షోలకు అనుమతి ఇవ్వడం లేదు.. ఇంతే కాకుండా కొన్నాళ్లుగా నిబంధనలను ఉల్లంఘించిన థియేటర్స్ ను సీజ్ చేస్తున్నారు. ఇలా వరుసగా థియేటర్స్ ఫై జగన్ ఉక్కుపాదం మోపడం తో ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణాలో థియేటర్ పార్కింగ్ ఫీజు, ఆంధ్రాలో ఉన్న టికెట్ రేట్ల కంటే ఎక్కువగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సీనియర్ నటుడు బ్రహ్మాజీ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. “వైఎస్ జగన్ సార్… అందరికీ వరాలు ఇస్తున్నారు… పాపం థియేటర్ ఓనర్స్ కి, సినిమా వాళ్ళకి హెల్ప్ చేయండి… ఇట్లు మీ నాన్న గారి అభిమాని” అంటూ బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో తెలంగాణ థియేటర్ పార్కింగ్ ఫీజు, ఆంధ్రాలో ఉన్న టికెట్ రేట్లకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా ఈ నటుడు జత చేశారు. ప్రస్తుతం బ్రహ్మాజీ ట్వీట్ వైరల్ గా మారింది.

మరోపక్క ఎగ్జిబిటర్ల అంత తమ సమస్యలపై చర్చించడానికి .. భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడానికి గురువారం విజయవాడలో సమావేశానికి పిలుపునిచ్చారు. మరి ఈ సమావేశం అనంతరం ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

<blockquote class=”twitter-tweet”><p lang=”et” dir=”ltr”><a href=”https://twitter.com/ysjagan?ref_src=twsrc%5Etfw”>@ysjagan</a> Sirr.. andhariki varalu isthunnaru.. papam theatre owners ki.. cinema vaallaki help cheyyandi.. itlu Mee nanna gari abhimaani 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 <a href=”https://t.co/wUV2yGzHUG”>https://t.co/wUV2yGzHUG</a></p>&mdash; Brahmaji (@actorbrahmaji) <a href=”https://twitter.com/actorbrahmaji/status/1473697955312017419?ref_src=twsrc%5Etfw”>December 22, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>