జమ్మూ కశ్మీర్ లో వైరస్ వ్యాప్తికి పాక్‌ కుట్ర

జమ్మూ కశ్మీర్​కు కరోనా బాధితుల చేరవేత..కశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్బాగ్ సింగ్ వెల్లడి

corona virus
corona virus

జమ్మూ: కరోనా నేపథ్యంలో భారత్‌లో పాకిస్థాన్‌ కుట్ర చేస్తుంది. కరోనా వైరస్‌ సోకిన వారిని జమ్మూ కశ్మీర్ కు పంపిస్తోంది. తద్వారా ఆ రాష్ట్రంలో వైరస్‌ను వ్యాప్తి చేయాలని పాక్‌ కుట్ర చేస్తోందని జమ్మూ కశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్బాగ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ కు 20 కిలోమీటర్ల దూరంలోని గందర్బాల్ జిల్లాలోని ఓ క్వారంటైన్ సెంటర్ ను పరిశీలించిన తర్వాత ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘కశ్మీర్ లోయలోకి పాక్ కరోనా రోగులను చేరవేస్తోందనేది నిజం. ఈ విషయాన్ని మేం గుర్తించాం. ఇప్పటిదాకా పాక్ ఉగ్రవాదులనే కశ్మీర్ కు పంపించేది. కానీ, ఇప్పుడు ఇక్కడి ప్రజలకు వైరస్ అంటించేందుకు కొవిడ్19 రోగులను చేరవేస్తోంది. ఈ విషయంలో మేం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని అయన చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) మీదుగా కరోనా రోగులను సరిహద్దు దాటిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని కొన్ని వారాల కిందటే ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/