ఏపిలో మరో 80 కరోనా పాజిటివ్‌ కేసులు

893 కు చేరిన కరోనా భాధితుల సంఖ్య

corona virus
corona virus

అమరావతి: రాష్ట్రంలో గత 24 గంటలలో కొత్తగా మరో 80 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 893 కు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా నమోదు అయిన కేసులలో కర్నూలు జిల్లాలొ 31, గుంటూరు జిల్లాలో 18, చిత్తురు జిల్లాలో 14, అనంతపురం జిల్లాలో 6, తూ.గో జిల్లాలో 6, ప్రకాశం జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 2, విశాఖ జిల్లాలో ఒక కరోనా కేసు నమోదు అయినట్లు తెలిపారు. ఇప్పటి వరకు అత్యధికంగా కర్నూలు జిల్లాలో 234 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. గుంటూరు జిల్లాలో 195 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కేవలం ఈ రెండు జిల్లాలోనే నమోదయిన కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయిన కేసులలో 46 శాతం ఉండడం గమనార్హం. కాగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్‌య27 కు చేరగా.. 141 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 725 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/