ఆస్కార్ రావడం పట్ల ఎన్టీఆర్ , చరణ్ ల స్పందన

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడం పట్ల యావత్ దేశ ప్రజలు గర్వంగా ఫీల్ అవుతున్నారు. సినీ అభిమానులు, ప్రముఖులే కాదు అన్ని రంగాల వారు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. ఈ తరుణంలో అవార్డు రావడం పట్ల చిత్ర నటులు ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు తమ స్పందనను తెలిపారు.

ఆస్కార్ రావడం ఎంతో సంతోషంగా ఉందని , నాటునాటు పాటకు అవార్డు రావడం ఎమోషనల్ మూమెంట్ అని ఎన్టీఆర్ అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇండియాకు ప్రాతినిథ్యం వహించిందని తెలిపారు. ‘కంగ్రాచ్యులేషన్స్ కీరవాణి సర్ జీ, జక్కన్న (రాజమౌళి), చంద్రబోస్ గారు’ అని ట్వీట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టీమ్ కు అభినందనలు తెలియజేశారు.

మేం గెలిచాం. ఇండియన్ సినిమాను గెలిపించాం. భారతదేశాన్ని గెలిపించాం. ఆస్కార్​ను మన ఇంటికి తీసుకొస్తున్నాం.’ అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు.