మూడు నెలల తర్వాత పవన్ బయటికొచ్చి హడావిడి చేస్తున్నారు – మంత్రి దాడిశెట్టి రాజా

రేపు మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ జరగబోతుంది. ఈ క్రమంలో నాల్గు రోజుల ముందే పవన్ కళ్యాణ్ విజయవాడ కు చేరుకొని పలు కులాలతో సమీక్షలు , భేటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఫై వైస్సార్సీపీ నేతలు మరోసారి విమర్శలు చేసే పనిలో పడ్డారు. తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ..మూడు నెలల తర్వాత పవన్ బయటికొచ్చి హడావిడి చేస్తున్నారని విమర్శించారు.

బీసీలు, కాపులు కలిసి రాజ్యాధికారం చేపట్టాలని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారన్నారు. బీసీలకు రాజ్యాధికారం అంటే చంద్రబాబు పల్లకీ మోయడమేనా అని వ్యాఖ్యలు చేశారు. కొత్తగా చంద్రబాబుతో కలిసి ఉన్నట్లు పవన్ మాట్లాడుతున్నారన్నారు. 2014 నుంచి చంద్రబాబు తో పవన్ కలిసే ఉన్నారని స్పష్టం చేశారు. పవన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు, చంద్రబాబుకు కాపులు ఓటేయకపోతే బీసీలు బానిసలైపోతారనేలా పవన్ మాట్లాడుతున్నారని అన్నారు. ఈనెల 14న పవన్ యాక్టింగ్‌ను బట్టి అతని ప్యాకేజ్ ఉంటుందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ఆస్కార్ రావడం సంతోషంగా ఉందని తెలిపిన మంత్రి.. ఈనెల 14న నాటు నాటు పాటకు మించి పవన్ డాన్సు ఉంటుందని.. చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్ రేపు పవన్ చదువుతారని ఎద్దేవా చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు వచ్చిన ఆస్కార్ కంటే పవన్ యాక్టింగే ఆస్కార్ ఉండబోతోందన్నారు.