ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు

KTR

ట్యాంక్ బండ్‌పై ప్రతి ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని కేటీర్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. పలువురు నగర వాసులు ట్యాంక్ బండ్‌ను వీక్షించేందుకు ట్రాఫిక్‌ను నిలువరించాలని ట్విట్టర్ ద్వారా పలువురు విజ్ఞప్తి చేయడంతో మంత్రి కెటిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ జరగనుంది.

ట్యాంక్ బండ్ అందాలను ఆస్వాదించేందుకు అనుకూలంగా ఉండేందుకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ సమయంలో వాహనాలను ప్రత్యామ్నాయమార్గాల్లోకి మళ్లించనున్నారు. సాధారణంగా నగర వాసులు ఆదివారం సెలవు కావడంతో ట్యాంక్ బండ్‌ను సందర్శించేందుకు వస్తుంటారు. వారికి ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. వాహనాలను పార్కింగ్ చేయడం, రోడ్డు దాటడం తదితరాల విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.