పొలిటికల్ ఎంట్రీ ఫై ‘ఆపద్బాంధవుడి’ రియాక్షన్ ..

ఆపద్బాంధవుడు గా పిలువబడే సోనూసూద్..పొలిటికల్ ఎంట్రీ ఫై తన స్పందనను తెలియజేసారు. వెండితెర ఫై విలన్ గా రాణించిన సోనూ..రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో కోట్లాదిమందికి ఆర్ధిక సహాయం చేసి దేవుడయ్యాడు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో.. ప్రజలు కష్టాలు ఎదురుకోవద్దనే ఉద్దేశంతో ఆయన స్వయంగా ఆక్సిజన్ ప్లాంటులు ఏర్పాటు చేయడమే కాదు..ఆక్సిజన్ కావాలన్నా వారికీ స్వయంగా ఇంటికి ఆక్సిజన్ ను పంపి ఆపద్బాంధవుడు అయ్యాడు.

అలాంటి గొప్ప వ్యక్తి రాజకీయాల్లోకి రాబోతున్నారని..2022 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ముంబై మేయర్‌గా పోటీ చేస్తున్నారంటూ ఓ మీడియా సంస్థ ట్వీట్ చేయడం తో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వార్త చూసి చాలామంది తమ మద్దతు సోనూకే అని చెప్పడం స్టార్ట్ చేసారు. అయితే ఈ వార్తల ఫై సోనూ క్లారిటీ ఇచ్చారు. ‘ఇది నిజం కాదు.. నేను సామాన్యుడిగానే సంతోషంగా ఉన్నాను ’ అంటూ ఆయన తెలిపారు. గతంలోనూ సోనూ దేశ ప్రధాని కావాలని చాలామంది కోరడం జరిగింది. అప్పుడు కూడా సోనూ రాజకీయాల్లోకి రావడం ఇష్టంలేదని..ఇలా సామాన్యుడిగానే సేవ చేయడం ఇష్టమని తెలిపారు.

ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం సోనూ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా..కాజల్ , పూజా హగ్దే లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం.