నేటితో నామినేషన్ల పర్వం ముగింపు

ఈరోజు తో రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగియనుంది. తెలంగాణ లో 17 స్థానాలకు గాను లోక్ సభ ఎన్నికలు , ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక , ఇక ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు , 25 లోక్ సభ స్థానాలకు సంబంధించి మే 13 న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అభ్యర్థులు గత వారం రోజులుగా నామినేష్లలు దాఖలు చేస్తూ వస్తున్నారు.

తెలంగాణ లో ఇప్పటి వరకు మొత్తం 478 మంది అభ్యర్థులు, 554 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.. ఇక, కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా జరుగుతోన్న నేపథ్యంలో.. ఇప్పటికే ఆ స్థానంలో 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణకు డెడ్‌లైన్‌ ఉండగా.. రేపు నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది.

ఏపీ విషయానైకి వస్తే అసెంబ్లీకి 3,644, లోక్‌సభకు 654 నామినేషన్లు దాఖలు అయ్యాయి.. బుధవారం ఒక్కరోజే అసెంబ్లీకి 1,294, లోక్‌సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలు కావడం విశేషం.. ఇక, ఈరోజునామినేషన్ల స్వీకరణ ముగియనుండడంతో.. పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు.. మరికొందరు కీలక అభ్యర్థులు ఈ రోజు నామినేషన్లు వేయబోతున్నారు.