నేడు మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్న నారా లోకేష్

Nara Lokesh will go to Delhi again today

అమరావతిః టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈరోజు మరోసారి ఢిల్లీకి వెళ్ళనున్నారు. సిబిఎన్ క్వాష్ పిటిషన్ ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్ రేపు సుప్రీంలో విచారణ జరగనున్న నేపథ్యంలో లాయర్లతో ఆయన చర్చించనున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇటీవల లోకేష్ సిఐడి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అనంతరం చంద్రబాబుతో ములఖత్ అయ్యి…. హైదరాబాద్ కి వెళ్లారు. అక్కడే ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇది ఇలా ఉండగా చంద్రబాబు అరెస్ట్ పై నారా లోకేష్ ట్వీట్ చేసారు. అక్రమ అరెస్టు చేసి, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, జ్యుడీషియల్ రిమాండ్ లోనే చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించినా, తప్పుడు నివేదికలు ఇస్తూ, అంతా బావుందని ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. న్యాయానికి ఇంకెన్నాళ్లు ఈ సంకెళ్లు అని నినదిస్తూ నేను, బ్రాహ్మిణి హైదరాబాద్ నివాసంలో నిరసన తెలిపామన్నారు లోకేష్.