బిఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో పై వైఎస్‌ షర్మిల చురకలు

Y.S. Sharmila

హైదరాబాద్‌ః కొండంత రాగం తీసి పిల్లికూత కూసినట్లుంది కెసిఆర్ ఎన్నికల మ్యానిఫెస్టో అంటూ వైఎస్‌ షర్మిల చురకలు అంటించారు. పోయిన ఎన్నికలకు ఇచ్చిన హామీలే నెరవేర్చే దిక్కు లేదు… మళ్లీ కొత్త కథ మొదలు పెట్టిండని ఫైర్ అయ్యారు. బ్రతుకు మీద ఇవ్వాల్సిన ధీమా పక్కన పెట్టి పోయాక భీమా ఇస్తాడట. సున్నా వడ్డీకే రుణాలు అని మోసం చేసిన దొర గారు ప్రతి మహిళకు నెలకు 3 వేలు ఇస్తామనడం హాస్యాస్పదం. నిరుద్యోగ భృతి అని గత మ్యానిఫెస్టోలో పెట్టిన పథకానికే దిక్కులేదు కానీ ఇప్పుడు 3 వేలు ఇస్తామంటే నమ్మాలా? అంటూ నిలదీశారు.

విడతల వారీగా పెన్షన్ల పెంపు ఒక పెద్ద జోక్. రుణమాఫీ పై దొర గారి యూ టర్న్. ఉద్యోగాలు ఇవ్వలేక ఏనాడో చేతులెత్తేశారు. ఉన్న పథకాలను పాతర పెట్టి ఓట్ల కోసం కొత్త పథకాలు అంటూ డ్రామాలు తప్ప మరోటి లేదు. బందిపోట్లు సమితి మ్యానిఫెస్టో ఓట్ల కోసం తప్ప ప్రజల కోసం కాదని వైఎస్‌ షర్మిలఫైర్ అయ్యారు.