నేడే సూర్యగ్రహణం..ఆలయాల మూసివేత..

Tirumala Temple
Tirumala Temple

నేడు సూర్యగ్రహణం సందర్భాంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు మూసివేశారు. సూర్యగ్రహణం సాయంత్రం 4:29 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:42 గంటలకు ముగుస్తుంది. అంటే దాదాపు 1:15 నిమిషాల పాటు గ్రహణం భారతదేశంతోపాటు ఐరోపా, ఆఫ్రికా ఖండంలోని ఈశాన్య భాగం, ఆసియాలోని నైరుతి భాగం, అట్లాంటిక్‌లో కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను మూసివేశారు.

యాదాద్రి ఆలయాన్ని ఈరోజు ఉదయం 8:50 నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు మూసివేయనున్నారు. భద్రాద్రి ఆలయాన్ని ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు మూసివేయనున్నారు. జగిత్యాలలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని మూసివేశారు. ధర్మపురి ఆలయాన్ని నిత్యారాధన, నివేదన అనంతరం మూసివేయనున్నారు. తిరుమలలో ఉదయం 8 నుంచి రాత్రి 7:30 గంటలకు వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. అన్ని ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.