మరోసారి నోరు జారిన నారా లోకేష్..రోజా కామెంట్స్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి నోరు జారీ వైసీపీ నేతలకు చిక్కాడు. ఈరోజు రాజమండ్రి జైల్లో చంద్రబాబు తో ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ..ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబుకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పబోయి.. చంద్రబాబు చేసిన అన్యాయాన్ని అంటూ లోకేష్ పొరపాటున మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ లోకేష్ చేసిన వ్యాఖ్యలను షేర్ చేసింది.

‘చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయానికి ఈరోజు అరెస్టు అయ్యారు, చంద్రబాబు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల డబ్బులను దోచుకున్నారో ఆయన చేసిన అన్యాయాన్ని గడపగడపకి వైసీపీ వెళ్ళి తెలియజేస్తుంటే, మేము కూడా గడపగడపకు వెళ్లి ప్రతిమనిషికి కూడా చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాన్ని చెబుతామని చెప్పినందుకు థాంక్యూ.. లోకేశ్. ఇప్పటికైనా మీ తండ్రి చేసిన తప్పుల్ని, ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పడమే కాదు ప్రజల్ని క్షమించమని అడిగితే ఇంకా బాగుంటుంది..!!’ అంటూ ట్వీట్ చేశారు.