ఇసుక దొరక్క, పనులు లేక కార్మికుల ఇబ్బందులు

అక్రమ రవాణా చేస్తూ కోట్లు మింగుతున్న వైఎస్‌ఆర్‌సిపి నేతలు

nara lokesh
nara lokesh

అమరావతి: టిడిని నేత నారా లోకేశ్‌ జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపి ఇసుకాసురులు బరితెగించారు. ఇసుక దొరక్క, పనులు లేక పస్తులుండి భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తూ కోట్లు మింగుతున్న వైఎస్‌ఆర్‌సిపి నేతలు రోడ్ల మీద వీరంగం వేస్తున్నారుగ అని ఆయన ఆరోపిస్తూ ట్వీట్లు చేశారు. ‘అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బంధువు దుద్దకుంట సురేందర్ రెడ్డి రోడ్డు మీద తప్పతాగి హల్ చల్ చేశాడు. అడ్డొచ్చిన ఎస్సై శరత్ చంద్రగారిపై తిరగబడి వార్నింగ్ ఇచ్చాడు’ అని నారా లోకేశ్ తెలిపారు. ‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే అరెస్ట్ చెయ్యమని ఒత్తిడి చేస్తున్న కొంతమంది అధికారులకు వైఎస్‌ఆర్‌సిపి నేతలు చేస్తున్న అరాచకాలు కనిపించడం లేదా? వైఎస్‌ఆర్‌సిపి నేతల నుండి పోలీసులకే రక్షణ లేనప్పుడు ఇక ప్రజల పరిస్థితి ఏంటి?’ అంటూ నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/