యువగళం సభలో వైస్సార్సీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. నిన్న గన్నవరం కు చేరుకోగా..టీడీపీ నేతలు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసారు. ఈ సభలో నారా లోకేష్ సీఎం జగన్ ఫై గన్నవరం వైస్సార్సీపీ నేతలు కొడాలి నాని , వంశీ లపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

టీడీపీ పార్టీకి కంచుకోట.. గన్నవరం. పుచ్చలపల్లి సుందరయ్య, దాసరి బాలవర్ధన్‌రావు వంటి ఎంతోమంది గొప్పవాళ్లు గన్నవరం ఎమ్మెల్యేలుగా చేశారు. ఇంత చరిత్ర ఉన్న గన్నవరంలో మేం చేసిన తప్పు వల్ల ఇక్కడొక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యాడు. గన్నవరం ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. మళ్లీ అలాంటి తప్పు చేయం. ఈ పిల్ల సైకో ఓ మహానటుడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా ఛాంబర్‌లోకి వచ్చి.. సార్‌, సార్‌ అని నిల్చునేవాడు. కూర్చోమన్నా.. నిల్చునే ఉంటాననేవాడు. 2012లో కృష్ణా జిల్లాకు సగం దరిద్రం పోయింది. ఆ సన్నబియ్యం సన్నాసి పోయాడు. ఇప్పుడు ఈ పిల్ల సైకో పోవడంతో మిగిలిన సగం దరిద్రం పోయింది. తన గెలుపు కోసం పనిచేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి మరీ వంశీ జైలుకు పంపించాడు. గన్నవరం పిల్ల సైకోకు భయం పరిచయం చేస్తా. నిజమైన షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చే బాధ్యత నాది” అని లోకేశ్‌ అన్నారు.

మన తల్లి ని అసెంబ్లీ సాక్షిగా అవమానించిన కొడాలి నాని గాడిని గుడివాడ సెంటర్ లో కట్ డ్రాయర్ మీద ఊరేగింపు చేసే బాధ్యత నాదంటూ హెచ్చరించారు నారా లోకేష్‌. లోకేష్ పాదయాత్ర చేస్తుంటే జగనుకు కాలినొప్పి వచ్చిందని.. ఇచ్చిన హామీల విషయంలో పదే పదే మడమ తిప్పాడు.. అందుకే మడమ నొప్పి వచ్చిందని ఎద్దేవా చేశారు.