తుపాకి మిస్ఫైర్.. హెడ్కానిస్టేబుల్ మృతి
తుపాకీ మిస్ఫైర్ అయ్యి హెడ్కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన హైదరాబాద్లోని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కబుతర్ఖానా ప్రాంతంలో రాత్రి విధులు ముగించుకుని వచ్చిన హెడ్కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ నిద్రించే సమయంలో అతడి చేతిలోని తుపాకి మిస్ఫైర్ అయింది.
తూటాలు శరీరంలోకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. డిసిపి సాయి చైతన్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు.