జగన్ సర్కార్ కు ఇండిగో షాక్
జగన్ సర్కార్ కు వరుస షాకులు తప్పడం లేదు..ఇప్పటికే పలు షాకులు తగలగా…తాజాగా ఇండిగో విమాన సంస్థ షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం బకాయి నిధులు ఇవ్వట్లేదని కడపకు విమాన సర్వీసులు నిలిపివేస్తామని ఇండిగో సంస్థ పేర్కొంటుంది.
ఏపీ ఎయిర్పొర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండిగో సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏటా 20 కోట్లు ఇండిగో సంస్థకు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు. అయితే.. ఆ నిధులు ఇవ్వకపోవడంతో సెప్టెంబర్ 1 నుంచి విమాన సర్వీసులు నిలిపివేయాలని ఇండిగో ఇప్పటికే టికెట్ల విక్రయం ఆపేసింది. దీంతో ఆ బకాయి నిధులు ఇచ్చేందుకు జగన్ సర్కార్ కసరత్తు చేస్తోందట.