ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో చేరిన జీవిత , హేమ
చిత్రసీమలో ‘మా’ అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరు జోరుగా సాగుతున్నాయి. మొన్నటి వరకు అధ్యక్ష పీఠం కోసం ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ , హేమాలు బరిలో ఉండగా..ఇప్పుడు జీవిత, హేమ లు ప్రకాష్ రాజ్ ప్యానెల్లో చేరారు. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమ శిక్షణ కమిటీ తమ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ప్రకాశ్ రాజ్ ప్రెస్మీట్ పెట్టి తమ ప్యానల్ సభ్యులను వెల్లడించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో జనరల్ సెక్రటరీగా జీవిత, ఉపాధ్యక్షురాలిగా హేమ పోటీ చేస్తున్నారు. జయసుధ అమెరికా వెళ్లిపోవడం వల్ల తమ ప్యానెల్లో లేరని.. ప్యానెల్కు అండగా ఉంటానని జయసుధ తెలిపినట్లు ప్రకాశ్ రాజ్ చెప్పారు.
ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు:
- అధ్యక్షుడు- ప్రకాశ్రాజ్
- ట్రెజరర్-నాగినీడు
- జాయింట్ సెక్రటరీ: అనితా చౌదరి, ఉత్తేజ్
- ఉపాధ్యక్షుడు: బెనర్జీ, హేమ
- ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్
- జనరల్ సెక్రటరీ: జీవితా రాజశేఖర్
ప్రకాశ్ రాజ్ ఎక్స్క్యూటివ్ మెంబెర్స్ జాబితా ఇదే:
- అనసూయ
- అజయ్
- భూపాల్
- బ్రహ్మాజీ
- ప్రభాకర్
- గోవింద రావు
- ఖయూమ్
- కౌశిక్
- ప్రగతి
- రమణా రెడ్డి
- శివా రెడ్డి
- సమీర్
- సుడిగాలి సుధీర్
- సుబ్బరాజు. డి
- సురేష్ కొండేటి
- తనీష్
- టార్జాన్ దీంతో త్వరలో జరగబోయే ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్యే పోటీ ఉండనుంది.