ఏపి మరో 43 పాజిటివ్ కేసులు
87కు చేరిన మొత్తం కేసులు

అమరావతి: ఏపిలో కరోనా కేసులు అమాంతం పెరిగిపోయాయి. మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిని పరీక్షించగా మరో 43 మందికి కొత్తగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఏపిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87 కి చేరింది. 12గంటల్లో మొత్తం 373 మందిని పరీక్షించగా 43 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. 330 మందికి నెగిటివ్ అని తేలింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/