కాంగ్రెస్కు 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా
గవర్నర్కు రాజీనామా లేఖలు పంపిన నేతలు
భోపాల్: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సింధియా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యెలు తమ పదవులకు రాజీనామా చేశారు. వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన లేఖను తమ రాష్ట్ర గవర్నర్కు వారు పంపారు. ప్రస్తుతం వీరంతా బెంగళూరులో ఉన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక బిజెపి నేతలు వీరి వసతి సౌకర్యాలు పర్యవేక్షిస్తున్నట్లు ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలపై బిజెపి , కాంగ్రెస్ కీలక నేతలు చర్చోపచర్చల్లో పాల్గొంటున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్తో ఆ పార్టీ నేతలు దిగ్విజయ్ సింగ్, జితు పట్వారీతో పాటు పలువురు సమావేశమయ్యారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/