ప్రణబ్‌ ఆరోగ్యంపై తాజా బులెటిన్‌

వెంటిలేటర్‌పైనే ప్రణబ్..ఆర్మీ ఆసుపత్రి

Pranab Mukherjee

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందుతోన్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఆర్మీ ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. ప్రణబ్‌ ముఖర్జీకి ఆసుపత్రిలోని అత్యవసర సేవల విభాగంలో చికిత్స అందుతోందని వైద్యులు తెలిపారు. ఆయన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో దానికి చికిత్స అందిస్తున్నామని తెలిపింది. అలాగే, ఆయన కిడ్నీ సంబంధిత అవయవాల పనితీరు మెరుగుపడడం కోసం వైద్యం అందుతోందని చెప్పింది. ప్రణబ్ ముఖర్జీని ఇప్పటికీ వెంటిలేటర్‌పై ఉంచే చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆయన కోమాలోనే ఉన్నారని వివరించింది. ఆయన గుండెకు సంబంధించిన వ్యవస్థల పనితీరు స్థిరంగా ఉందని చెప్పింది. కాగా ఆయనకు కరోనా సోకడంతో పాటు మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ చేయగా, అనంతరం ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/