కేటీఆర్ రాజ్యాంగం చదువుకోవాలి..కోమటిరెడ్డి

స్థానిక ఎంపీనైన తనను పట్టించుకోలేదని ఫైర్

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన నియోజకవర్గంలో నేడు పర్యటనకు వచ్చిన కేటీఆర్, స్థానిక ఎంపీనైన తనకు సమాచారం అందించకపోవడం ఏంటని కోమటిరెడ్డి మండిపడ్డారు. తాను ఎంతో ఉన్నత విద్యావంతుడ్నని తల ఎగరేసే కేటీఆర్ ఓసారి భారత రాజ్యాంగాన్ని చదువుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ ఓ పిరికి పంద అని, విపక్షనేతలను ఎదుర్కొనే దమ్ములేదని విమర్శించారు. త్వరలోనే కేటీఆర్ అహంకారాన్ని తెలంగాణ ప్రజలు పాతాళానికి తొక్కేస్తారని వ్యాఖ్యానించారు.

“మిస్టర్ కేటీఆర్… నీ అధికారం, నీ హోదా, నీ అక్రమ సంపాదన ఏదీ శాశ్వతం కాదన్న సంగతి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జీవితాంతం నీ వెంటే ఉంటాయని అనుకోవద్దు. ఈ వాస్తవాన్ని నువ్వు తెలుసుకుంటాని, నీ పంథా మార్చుకుంటావని ఆశిస్తున్నా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను గౌరవించడం ఎలాగో దయచేసి నేర్చుకో” అంటూ హితవు పలికారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/