నేడు సిరిసిల్ల‌లో మంత్రి కేటీఆర్ పర్యటన

హైదరాబాద్: నేడు సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టించనున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అభివృద్ధి ప‌నులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎల్లారెడ్డిపేట‌లో మండ‌లంలో డ‌బ‌ల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించ‌నున్నారు. రాచ‌ర్ల బొప్పాపూర్‌లో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను, బోయిన‌ప‌ల్లి మండ‌లంలో కొదురుపాక‌లో రైతువేదికను ప్రారంభిస్తారు. కేటీఆర్ అమ్మ‌మ్మ-తాత‌య్య జ్ఞాప‌కార్ధం కొదురుపాక‌లో ఈ రైతు వేదిక‌ను నిర్మించారు. అదేవిధంగా కొదురుపాక చౌర‌స్తాలో నాలుగు వ‌రుస‌ల ర‌హ‌దారికి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. కొదురుపాక చౌర‌స్తా నుంచి వెంక‌ట్రావుప‌ల్లి శివారు వ‌ర‌కు రోడ్డును నిర్మించ‌నున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/