కాంగ్రెస్ లో మరోసారి భగ్గుమన్న వర్గపోరు

కాంగ్రెస్ పార్టీ లో వర్గ విభేదాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గడం లేదు. సీనియర్ నేతల దగ్గరి నుండి గల్లీ నేతల వరకు..ఇలా అందరిలో విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా వరంగల్ లో ఇదే జరిగింది. కొండా మురళి వర్గీయులు, నూతన జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వర్గీయుల మధ్య కొట్లాట జరిగింది. జిల్లా కేంద్రంలోని అబ్నస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

పరస్పరం కార్యకర్తలు చెప్పులతో కొట్టుకున్నారు. అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఎర్రబెల్లి స్వర్ణ.. మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఇంటికి వెళ్లి కలువలేదని, ప్రమాణస్వీకారం కార్యక్రమానికి వారిని ఆహ్వానించలేదని కొండా వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పర వాగ్వాదం చోటుచేసుకుంది. చిన్నగా మొదలైన గొడవ కాస్త కొట్టుకునేవరకు వెళ్లింది.