బీజేపీలో చేరిన సీతారాం నాయక్, జలగం, సైదిరెడ్డి

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ లో బిజెపి లోకి వలసల పర్వం నడుస్తుంది. బిఆర్ఎస్ నేతలు , ఇతర పార్టీల నేతలు బిజెపి లో చేరుతున్నారు. తాజాగా హుజుర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైది రెడ్డితో పాటు మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గోడం నగేశ్, జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే తాను బీజేపీలో చేరానని జలగం వెంకట్రావు స్పష్టం చేసారు.

ఖమ్మం అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ డెవలప్ కావడం లేదని , గత బీఆర్ఎస్ సర్కారు ఖమ్మానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వెంకట్రావు అన్నారు. అలాగే, మైనింగ్ కాలేజీని యూనివర్సిటీ చేయలేదని, భద్రాచలం గుడిని అభివృద్ధి చేయలేదని అన్నారు. తమ జిల్లాకు రావాల్సిన నీళ్లు రావడం లేదని అన్నారు.

ఇక శ్రీనివాస్ గోమాస మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కులను ప్రధాని మోడీ కాపాడుతున్నారని చెప్పుకొచ్చారు. పెద్దపల్లిలో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా తాను వారి గెలుపుకోసం పని చేస్తానని అన్నారు. పార్టీలో క్రమశిక్షణగల కార్యకర్తగా పనిచేస్తానని సైది రెడ్డి చెప్పుకొచ్చారు.