బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు

padi-kaushik-reddy

హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఈనెల7న కరీంనగర్ లో కేటీఆర్ కార్యకర్తల సమావేశంలో పోలీసులకు వార్నింగ్ ఇస్తూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ పురుషోత్తం, ఆశిష్ గౌడ్ ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కౌశిరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

అసలు కౌశిక్ ఏమన్నాడంటే.. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని, మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తాం.. వడ్డీతో సహా ఇచ్చేస్తామంటూ కౌశిక్ రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవర్నీ వదిలిపెట్టబోము.. ఎవరినైనా జైలుకు పంపిస్తాం అంటూ హెచ్చరించారు. దీనిపై పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దీంతో పోలీసుల మనోభావాలను దెబ్బతీశారంటూ పురుషోత్తం, ఆశిష్ గౌడ్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.