దలైలామాను కలిసిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్

ప్రపంచ పరిస్థితులపై చర్చించామన్న భగవత్

ధర్మశాల: ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాను ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కలిశారు. ధర్మశాలలోని దలైలామా నివాసానికి వెళ్లిన మోహన్ భగవత్ దాదాపు గంటసేపు ఆయనతో చర్చలు జరిపారు. కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులు తనను కలవడానికి దలైలామా అనుమతిని ఇవ్వలేదు. ఈ నెల 15 నుంచి కలిసేందుకు అవకాశం ఇస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రవాస టిబెటన్ అధ్యక్షుడు పెంపా తెర్సింగ్, ఆయన మంత్రివర్గం, టిబెటన్ పార్లమెంట్ స్పీకర్ సోనమ్ టెంఫెల్ ను కూడా మోహన్ భగవత్ కలిశారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల, కాంగ్రాలో ఐదు రోజుల పర్యటనలో భగవత్ ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై దలైలామాతో చర్చించినట్టు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/