మోడీ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే..

ప్రధాని మోడీ హైదరాబాద్ షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 08 న మోడీ హైదరాబాద్ లో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభ లో పాల్గొనబోతున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను అధికారులు విడుదల చేసారు.

ఏప్రిల్ 8న (శనివారం) ఉదయం 11.30 గంటలకు మోడీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లనున్నారు. అక్కడ సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభిస్తారు. అనంతరం 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు.

12.18 గంటల నుంచి 1.20 గంటల వరకు అక్కడ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతోపాటు పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. అనంతరం బహిరంగ సభ లో పాల్గొంటారు. ఆ తర్వాత 1.30 గంటలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తారు.