షర్మిలపై స్పీకర్‌కు ఎమ్మెల్యేల ఫిర్యాదు..

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌పై ప‌లువురు ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. పాద‌యాత్ర‌లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేల‌పై ష‌ర్మిల అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని స‌ద‌రు ఫిర్యాదులో ఎమ్మెల్యేలు ఆరోపించారు. నిరాధార ఆరోప‌ణ‌ల‌తో పాటు వ్య‌క్తిగ‌త విమర్శ‌లు చేస్తున్న ష‌ర్మిల త‌మ ప్రతిష్ఠ‌కు భంగం క‌లిగిస్తున్నార‌ని స‌ద‌రు ఫిర్యాదులో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధుల హక్కులకు, గౌరవానికి భంగం కలిగించినందుకు, నిరాధార ఆరోపణలు, జుగుప్సాకర ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. షర్మిలపై ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తామని స్పీకర్‌ పోచారం పేర్కొన్నారు. ఈ మేరకు ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తానని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు.