మంత్రి హరీశ్ రావుకు..బిజెపి ఎమ్మెల్యే ఈటల సవాల్

హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్..టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు చర్చకు రావాలని ఈటల సవాల్ విసిరారు. అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చేస్తున్న మోసాన్ని త్వరలోనే బహిర్గతమవుతంది.., వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.

తెలంగాణ ఆవిర్భావం నాటికి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ తన అనాలోచిత నిర్ణయాలతో అప్పుల పాలు చేశారన్నారు. 25 ఏళ్ల కాలపరిమితితో ఇబ్బడిముబ్బడిగా అప్పులు తెస్తూ ప్రజల నెత్తిన రుణ భారం మోపుతున్నారని ఆక్షేపించారు. సీఎం కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. వారిపై అప్పుల భారం మోపుతున్నారని విమర్శించారు. రాష్ట్రం తీసుకున్న అప్పుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాల్సి ఉన్నా… కేసీఆర్ పెట్టనివ్వరన్నారు. అప్పల గురించి ప్రజలకు సమాచారం ఇవ్వకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రజాస్వామ హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పాదయాత్రలకు పర్మిషన్ ఇవ్వకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యనించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఇలాగే వ్యవహరించి ఉంటే.. తెలంగాణ ఉద్యమం నడిచేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాల పట్ల అరాచకంగా వ్యవహరిస్తోందని అన్నారు.