నూతన సచివాలయం వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం

నూతన సచివాలయం వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. రివ్యూ మీటింగ్‌ కోసం సచివాలయం వెళ్లిన తనను పోలీసులు అడ్డుకున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సచివాలయంలోకి అనుమతి లేదా అని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన సచివాలయంలోకి.. ఎమ్మెల్యేలు రాకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.

సిటీ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఉందని మంత్రి తలసాని పిలిస్తేనే సచివాలయానికి వచ్చానని రాజాసింగ్ అన్నారు. ఎమ్మెల్యేలకే సచివాలయంలోకి అనుమతి లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజల డబ్బుతో కట్టిన సచివాలయంలోకి ప్రజా ప్రతినిధులను అనుమతించకపోవటం సిగ్గుచేటన్నారు.