మధ్యప్రదేశ్ మాజీ సీఎం మోతీలాల్ ఓరా మృతి
ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ తీవ్ర దిగ్భ్రాంతి

New Delhi: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మోతీలాల్ ఓరా (93) కన్నుమూశారు.
కరోనా బారిన పడి ఇటీవలే కోలుకున్న ఆయన మూత్రనాళ, శ్వాస కోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు.
చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఈ రోజు కన్నుమూశారు. ఆయన స్వరాష్ట్రం ఛత్తీస్ గఢ్. మోతీలాల్ ఓరా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారరు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/