‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్

నవీన్ పోలిశెట్టి – అనుష్క జంటగా మహేష్‌ బాబు.పి దర్శకత్వంలో యువీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ లు తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ . ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని చాల రోజులు అవుతున్న థియేటర్స్ లోకి వచ్చేందుకు మాత్రం వెనుకాముందు అవుతుంది. ఇప్పటికే పలు రిలీజ్ డేట్స్ చేంజ్ కాగా..రీసెంట్ గా సెప్టెంబర్‌ 7న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నేడు సోమవారం ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమా ఫై ఆసక్తి పెంచారు. ట్రైలర్ చూస్తే..ఈ సినిమాలో అనుష్క షెఫ్‌గా, నవీన్ స్టాండప్ కమెడియన్‌గా నటించారు.

ప్రేమ, రిలేషన్‌షిప్స్, పెళ్లి మీద అస్సలు ఆసక్తి, నమ్మకం లేని అమ్మాయిగా అనుష్క కనిపించారు. అలాంటి అమ్మాయి హీరోని ఇష్టపడుతుంది. కానీ పెళ్లి చేసుకోవడానికి కాదు. గర్భం దాల్చడానికి అతడిని హెల్ప్ అడుతుగుంది. ఇదేంటో అర్థంకాక గందరగోళ పరిస్థితిలో హీరో పడతాడు. ఇదే విషయాన్ని ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. ముఖ్యంగా డైలాగులు చాలా బాగున్నాయి. ఒక సరికొత్త ప్రేమకథను ఎంటర్‌టైనింగ్‌గా, ఎమోషనల్‌గా చెప్పడానికి దర్శకుడు మహేష్ బాబు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

YouTube video