ఆందోళన వద్దు వారందరికీ ఫ్రీ కరెంటే – మంత్రి పొన్నం స్పష్టం

లాండ్రీ, ధోబీ ఘాట్‌లు, కటింగ్ షాపులకు ఫ్రీ కరెంట్ ఇస్తామని భరోసా ఇచ్చారు మంత్రి పొన్నం. రజక, నాయి బ్రాహ్మణల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని , వారి కరెంట్ కనెక్షన్ విద్యుత్ అధికారులు తీసివేయరని తెలిపారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో లాండ్రీలు, ధోబీ ఘాట్‌లు, హెయిర్ కటింగ్ సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామన్నారు. వాషర్ మెన్‌లో లబ్ధిదారుల సంఖ్య 76,060 కి 78.55 కోట్లు, నాయి బ్రహ్మణులకు 36,526 మంది బెనిఫియర్లకు రూ.12.34 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆర్థికశాఖకు ప్రపోజల్ పంపించామని, త్వరలోనే నిధులు రిలీజ్ అవుతాయన్నారు. నాయిబ్రహ్మణులు, వాషర్ మెన్‌లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.