ప్రత్యేక తెలంగాణ ఏర్పడగానే కాంగ్రెస్ అధికారం చేపడితే ఎంతో అభివృద్ధి జరిగేది – చిదంబరం

ప్రత్యేక తెలంగాణ ఏర్పడగానే కాంగ్రెస్ అధికారం లోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆరోపించారు. తెలంగాణకు వచ్చి మోడీ.. సీఎం కేసీఆర్‌ను తిడతారని, కేసీఆర్ తెలంగాణ మొత్తం తిరిగి మోడీని తిడతారని, కానీ వీరెవరూ తెలంగాణ ప్రజల సమస్యలపై మాట్లాడరని విమర్శించారు. అన్ని రంగాల్లో తెలంగాణ ఆశించిన దాని కంటే వెనుకబడిందన్నారు.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది ఉండేదన్నారు.