అనిల్ కుమార్ యాదవ్ ఫై మేకపాటి కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ కి ఓటు వేశారని, నలుగురు ఎమ్మెల్యేల ఫై జగన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సస్పెండ్ కు గురైన నలుగురు ఎమ్మెల్యే లపై వైస్సార్సీపీ నేతలు పలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేసారు.

సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్పడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అనిల్ నువ్వు ఓడిపోతున్నావు ..ముందు అది చూసుకో..నీకు నోరు ఉందనే సీఎం మంత్రి పదవి నీకు ఇచ్చాడని ఆగ్రహించారు. మీ నలుగురు నూటికి నూరుపాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలుస్తాము, రాబోయే ఎన్నికల్లో మీరే చూస్తారు కదా..పార్టీ భ్రమలో మీరు మాట్లాడుతున్నారన్నారు. కచ్చితంగా ప్రభుత్వం మారుతుంది. గత ఎన్నికల్లో సింగిల్ డిజిట్ తో అనిల్ గెలిచాడు.. అది మర్చిపోయినట్లుగా ఉన్నారు. కాస్త గుర్తుంచుకోండని చురకలు అంటించారు. మమ్మల్ని సస్పెండ్ చేశారు, నీకు పార్టీ టికెట్టు ఇవ్వరని ప్రచారం జరుగుతోంది.. నీది…నువ్వు చూసుకో ముందు అంటూ సెటైర్లు వేశారు.