ఫేక్ సర్టిఫికేట్ ఆరోపణలపై స్పందించిన : స్పీకర్ సీతారాం

సరైన టైం అన్ని వివరాలతో సమాధానం ఇస్తానని వెల్లడి

ap-speaker-thammineni-sitharam-responds-over-fake-certificate-controversy

అమరావతిః ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫేక్ సర్టిఫికేట్‌కు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై తాజాగా స్పందించారు. ఈ ఆరోపణలపై తగిన సమయంలో సమాధానమిస్తానని స్పష్టం చేశారు. తనపై గవర్నర్‌కు, ఇతర ముఖ్యులకు ఫిర్యాదు చేస్తామంటున్న వారికి ఆ హక్కు ఉందని అన్నారు. వారు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని, అయితే తాను మాత్రం ఏ తప్పూ చేయలేదని తేల్చి చెప్పారు. ఏ తప్పు చేయని తాను ఎందుకు ఆందోళన చెందుతానని ప్రశ్నించారు.

తప్పుడు డిగ్రీ సర్టిఫికేట్‌తో తమ్మినేని సీతారం న్యాయవిద్యకు సంబంధించి మూడేళ్ల కోర్సులో చేరినట్టు శ్రీకాకుళం జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ పదవిలో ఉండి కూడా తప్పుడు సర్టిఫికేట్ సమర్పించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై ఇప్పటికే టిడిపి రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే సీతారాం ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలపై స్పందించారు. తాను ఏతప్పు చేయలేదని స్పష్టం చేశారు.