ఈనెల 25న కర్నూల్‌ జిల్లాలో మెగా జాబ్ మేళా

కర్నూల్ జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. ఈనెల 25న కర్నూల్‌ జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నారు. బేతంచెర్లలో నిరుద్యోగ యువతీ యువకులకు ఏపీ వృత్తి నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళా జరగనుంది. ఈ ఇంటర్వ్యూలు ఉదయం 9.30 గంటల నుంచి శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో జరుగుతాయని ఆ సంస్థ అధికారి ప్రతాపరెడ్డి తెలిపారు.

వైయస్ కే, ఇన్ఫోటెక్, బజాజ్, డిక్సన్, మ్యాన్యుఫాక్చరింగ్ కంపెనీలలో పని చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐటిఐ డిప్లొమా ఇంటర్ డిగ్రీ బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు అర్హులు. పూర్తి వివరాలకు 944022 4291 నెంబర్‌కు కాల్ చేయవచ్చనీ ప్రతాప్ రెడ్డి తెలిపారు.