తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..మూడేళ్ల విరామం తర్వాత 5శాతం డీఏ పెంపు

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది యాజమాన్యం. మూడేళ్ల విరామం తర్వాత 5 శాతం కరువు భత్యం(డీఏ) పెరుగుతుంది. వచ్చే వేతనాల నుంచి 5 శాతం డీఏను చెల్లించనున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మూల వేతనంపై 5 శాతం అంటే.. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్‌ వంటి యూనిఫారం ఉద్యోగులకు కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.1,500 వరకు భత్యం అదనంగా అందనుంది. వివిధ కేటగిరిల్లోని అధికారులకు రూ.1,500 నుంచి రూ.5,500 వరకు వేతనం అదనంగా అందనుంది. ఈ డీఏ ప్రకటనతో ఆర్టీసీపై నెలకు రూ.5 కోట్ల వరకు భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

వాస్తవానికి ఉద్యోగులు 2019లో సుదీర్ఘ సమ్మె చేయడం, తర్వాత కరోనా దెబ్బకు ఆర్టీసీ పరిస్థితి బాగా దెబ్బతిన్నది. దీంతో డిజేల చెల్లింపు ఆగిపోయింది. ఇక తాజాగా డి ఏ లను ఇస్తున్నట్లు ప్రకటించింది ఆర్టీసీ యాజమాన్యం. ఆరు డీఏలు కలిపి 27శాతం వరకు రావాల్సి ఉందని.. వెంటనే చెల్లించా లని ఆర్టీసీ ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగులకు ఇచ్చే డీఏను 5 శాతం పెంచుతూ ఎండీ సజ్జనార్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ఇటీవల బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకొన్న ఆర్టీసీ యాజమా న్యం.. వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది. ఆర్టీసీ చార్జీలను రౌండ్‌ ఫిగర్‌ చేయ డం, డీజిల్‌ సెస్సు విధించడం ద్వారా సంస్థ ఆదాయం స్వల్పంగా పెరగడంతో కార్మికుల సంక్షేమంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా పెండింగ్‌లో ఉన్న 6 డీఏల్లో ప్రస్తుతానికి ఒకదాన్ని ఇవ్వాలని సోమవారం నిర్ణయించినట్టు సమాచారం.